రేపటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నుండి కిసాన్ పోరాటాలు

by Disha Web Desk 12 |
రేపటి కాంగ్రెస్ ఆధ్వర్యంలో నుండి కిసాన్ పోరాటాలు
X

దిశ తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి కిసాన్ ఆందోళనలు ప్రారంభం కానున్నాయి. అన్ని జిల్లాల కలెక్టరేట్ల ముందు రైతులతో కలిసి కాంగ్రెస్ కార్యకర్తలు నిరసనలు వ్యక్తం చేయనున్నారు. అకాల పంట నష్టం ,మద్దతు ధర ,ధాన్యం కొనుగోలు లోని సమస్యలపై పరిష్కారం,న్యాయం చేయాలంటూ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురానున్నారు. అన్ని జిల్లాల కలెక్టర్లకు రైతు సంఘాలు కాంగ్రెస్ కిసాన్ కమిటీలు ఆధ్వర్యంలో రూపొందించిన వినతి పత్రాలను సమర్పించనున్నారు. ధాన్యం కొనుగోలు లో నిర్లక్ష్యం, తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయకపోవడం, తరుగు పేర దోపిడీ, మొక్కజొన్న పంట కొనుగోలు ప్రారంభించకపోవడం, వడగండ్ల వర్షం కు నష్టపోయిన పంటలకు నష్టపరిహారం ఇవ్వకపోవడం వంటి సమస్యలు ఆ వినతి పత్రంలో పొందుపరిచారు.

Also Read..

స్పీడ్ పెంచనున్న కాంగ్రెస్.. తెలంగాణలో ఆ మంత్రం పనిచేస్తుందా?



Next Story

Most Viewed