- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కార్మిక సంక్షేమం కోసం కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉంది : మంత్రి వివేక్ వెంకటస్వామి
కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకట స్వామి తెలిపారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ ప్రభుత్వం ఎప్పటికీ పేదల పక్షాన నిలుస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకలైన కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్వెంకట స్వామి తెలిపారు. గిగ్ వర్కర్లు ప్రస్తుతం అభివృద్ధి చెందుతున్న అగ్రిగేటర్ ఆధారిత ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్నారని పేర్కొన్నారు. ఆదివారం మంత్రిని గిగ్వర్కర్లు నివాసంలో కలిసి, రాష్ట్ర అసెంబ్లీలో గిగ్ వర్కర్ల చట్టం ఆమోదించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇటీవల జరిగిన బడ్జెట్ సమావేశాల్లో తెలంగాణ ప్లాట్ఫాం ఆధారిత గిగ్ వర్కర్స్ చట్టం - 2026 ఆమోదం పొందింది. ఇది గిగ్ వర్కర్ల హక్కులు, సంక్షేమానికి ఒక చారిత్రాత్మక ముందడుగు అని వర్కర్లు అన్నారు. అనంతరం మంత్రి వివేక్ మాట్లాడుతూ, ఈ చట్టం అమలు, బలోపేతం కోసం రాబోయే రోజుల్లో మరింత కృషి అవసరమని, సమాజంలోని చివరి వ్యక్తి వరకు సంక్షేమ పథకాలు చేరేలా ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఈ చట్టంతో లక్షలాది కుటుంబాలు లాభపడతాయని, రాబోయే రోజుల్లో మరింత మంది దీనిలో చేరుతారని పేర్కొన్నారు.






