కేటీఆర్‌‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. యాక్షన్ తీసుకోవాలని డిమాండ్..!

by Disha Web Desk 19 |
కేటీఆర్‌‌పై ఈసీకి ఫిర్యాదు చేసిన కాంగ్రెస్.. యాక్షన్ తీసుకోవాలని డిమాండ్..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌పై టీ-కాంగ్రెస్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియామవళికి విరుద్ధంగా కేటీఆర్ ఓటు వేసిన అనంతరం మీడియాతో మాట్లాడి కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశాడని కంప్లైంట్ చేసింది. ఈ మేరకు కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా, హైదరాబాద్‌లోని నందినగర్‌లో కుటుంబ సభ్యులతో కలిసి కేటీఆర్ తన ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేశారు. ఈ వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకున్న కాంగ్రెస్.. తాజాగా ఈసీకి ఫిర్యాదు చేసింది. దీంతో ఈసీ కేటీఆర్‌పై ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది.

Next Story

Most Viewed