మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుపై హెచ్‌ఆర్‌సీలో కంప్లైంట్

by Disha Web Desk 2 |
మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుపై హెచ్‌ఆర్‌సీలో కంప్లైంట్
X

దిశ, తెలంగాణ బ్యూరో: మంత్రి ఎర్రబెల్లి దయాకర్​రావుపై హెచ్‌ఆర్‌సీలో కంప్లైంట్ నమోదైంది. 55 ఏళ్ల ఎండీ రషీద్, అతని భార్య కరీమా, షరీఫ్, అజహార్, ఎస్​కే మజీద్ ఖాన్, ఎండీ లాల్​బీబీ, డి.సమ్మక్క మృతులకు మంత్రి ఎర్రబెల్లి కారణమంటూ కాంగ్రెస్​నేత బక్క జడ్సన్​ఫిర్యాదు చేశారు. వంతెన పాడైనా.. మరమ్మత్తులు చేయకపోవడంతోనే బాధితులకు ప్రమాదం జరిగినట్లు జడ్సన్​ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇక ఇటీవల ఏటూరు నాగారం మండలంలోని పత్తిపాక గ్రామంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో స్వయంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు గ్రామ పంచాయతీలోని ఖాళీ మద్యం బాటిళ్లను సేకరించి పంచాయతీల ఆదాయాన్ని పెంచాలని, దాంతోనే రోడ్లు, వంతెనలు రిపేర్లు చేసుకోవాలని బాధ్యతారాహిత్య ప్రకటన చేశారంటూ హెచ్‌ఆర్‌సీకి వివరించారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంలో ఎనిమిది మంది మృతదేహాలను వెలికితిశారని, రాష్ట్ర ప్రభుత్వం తరపున సకాలంలో చర్యలు తీసుకోలేదని జడ్సన్​ఫైర్ అయ్యారు.



Next Story

Most Viewed