రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై HRCలో ఫిర్యాదు

by Muthe.Rajitha |

కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడు రియాజ్ అనంతరం పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిన సంగతి తెలిసిందే.

రియాజ్‌ ఎన్‌కౌంటర్‌పై HRCలో ఫిర్యాదు
X

దిశ, వెబ్ డెస్క్ : కానిస్టేబుల్ ను కత్తితో పొడిచి హత్య చేసిన కేసులో నిందితుడు రియాజ్ అనంతరం పోలీసుల చేతిలో ఎన్కౌంటర్ అయిన సంగతి తెలిసిందే. అయితే రియాజ్ ఎన్కౌంటర్ పై హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఫిర్యాదు చేసారు కుటుంబ సభ్యులు. రియాజ్ తల్లి, భార్య HRCలో ఫిర్యాదు చేయగా.. దీనిపై మానవ హక్కుల కమిషన్ స్పందించింది. తెలంగాణ డీజీపీని నివేదిక కోరింది. నవంబర్ 3 లోగ సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. కాగా అరెస్ట్ అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ.. కానిస్టేబుల్ దగ్గర గన్ లాక్కునేందుకు ప్రయత్నించగా, పోలీసులు రియాజ్ ను ఎన్కౌంటర్ చేసారు.

Next Story