మాజీ CM కేసీఆర్‌పై కంప్లైంట్.. ఆ కేసులో ఏ1గా చేర్చాలని అరుణ్​కుమార్ డిమాండ్

by Disha Web Desk 19 |
మాజీ CM కేసీఆర్‌పై కంప్లైంట్.. ఆ కేసులో ఏ1గా చేర్చాలని అరుణ్​కుమార్ డిమాండ్
X

దిశ, తెలంగాణ క్రైం బ్యూరో: ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారానికి సంబంధించి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఏ1 నిందితునిగా చేర్చి కేసు నమోదు చేసి విచారణ జరపాలని పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు అందింది. ఈ మేరకు అడ్వకేట్​అరుణ్​కుమార్​పంజాగుట్ట సీఐ శోభన్‌కు లిఖితపూర్వక కంప్లైంట్​ఇచ్చారు. ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్​పలు రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కేంద్ర హోంశాఖ ప్రత్యేక అనుమతులతో మాత్రమే ఫోన్లు ట్యాపింగ్​చేయాల్సి ఉంటుందని తెలిపారు. దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టుగా అనుమానాలు ఉన్నవారి ఫోన్లను మాత్రమే ట్యాప్​చేయాల్సి ఉండగా బీఆర్ఎస్​ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రధాన నాయకుల ఫోన్లను ట్యాప్​చేయించినట్టు పేర్కొన్నారు. ఇదంతా కేసీఆర్​లబ్ధి కోసమే జరిగిందన్నారు. ఈ క్రమంలోనే ఆయనను ఏ1 నిందితునిగా పేర్కొంటూ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ జరిపించాలని కోరారు.



Next Story

Most Viewed

    null