CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు CM రేవంత్ కీలక ఆదేశాలు

by Gantepaka Srikanth |
CLP మీటింగ్‌లో సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు CM రేవంత్ కీలక ఆదేశాలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్(Telangana Congress) ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలకు ఆ పార్టీ అధిష్టానం కీలక ఆదేశాలు జారీ చేసింది. గురువారం హైదరాబాద్‌లోని మర్రి చెన్నారెడ్డి(Marri Chenna Reddy) మానవవనరుల అభివృద్ధి కేంద్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన సీఎల్పీ సమావేశం(CLP Meeting) జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కార్యచరణపై ఎమ్మెల్సీ(MLC), ఎమ్మెల్యే(MLA)లకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) దిశానిర్దేశం చేశారు. బీసీ కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలకంగా చర్చించారు. ఈ రెండు చారిత్రాత్మక నిర్ణయాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశించారు. అంతేకాదు.. రెండు భారీ బహిరంగ సభలు పెట్టాలని నిర్ణయించారు. ఈ సభలకు పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే(Mallikarjun Kharge), అగ్రనేత రాహుల్ గాంధీ(Rahul Gandhi)లను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్నారు. సీఎల్పీ అనంతరం ఢిల్లీకి వెళ్లనున్నారు.

ఇదిలా ఉండగా.. ఈ సీఎల్పీ సమావేశానికి రావాలని పార్టీ ఫిరాయించిన పదిమంది ఎమ్మెల్యేలకు కూడా ఆహ్వానం వెళ్లింది. అయితే.. అనూహ్యంగా వారు చివరి నిమిషంలో గైర్హాజరు అయ్యారు. ఫిరాయింపు కేసు అంశం ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉండటంతో హాజరు కావొద్దని నిర్ణయించుకున్నారు. అంతకుముందు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.. ఇది అత్యంత కీలకమైన శాసనసభ పక్ష సమావేశమని అన్నారు. కులగణన, ఎస్సీ వర్గీకరణపై కీలక సూచనలు సీఎం చేశారని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నిక విషయంలో ఎమ్మెల్యేలకే బాధ్యతలు ఇచ్చారని తెలిపారు. సమస్యలు, ఇబ్బందులు ఉన్న ఎమ్మెల్యేలు కూడా ఈ సమావేశంలో ఆవేదన చెప్పుకున్నారని అన్నారు. సాయంత్రం ఏఐసీసీ అధ్యక్షుడితో రాష్ట్ర పార్టీ ముఖ్యనేతల సమావేశం ఉండడంతో సాయంత్రం జరగాల్సిన సీఎల్పీ మీటింగ్‌ను ఉదయానికి మార్చినట్లు ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.



Next Story

Most Viewed