CM Revanth: అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయానికి సీఎం రేవంత్

by Gantepaka Srikanth |

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌(Mahbubnagar)లో పర్యటించనున్నారు.

CM Revanth: అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయానికి సీఎం రేవంత్
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) రేపు ఆయన సొంత జిల్లా మహబూబ్‌నగర్‌(Mahbubnagar)లో పర్యటించనున్నారు. ప‌ర్యట‌న‌లో భాగంగా ప‌లు అభివృద్ధి ప‌నుల‌కు శంకుస్థాప‌న చేయ‌నున్నారు. అమ్మాపురం కురుమూర్తి స్వామి ఆలయం(Ammapuram Kurumurthy Swamy temple)లో ప్రత్యేక పూజలు చేయనున్నారు. రూ.110 కోట్లతో ఘాట్ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) మహారాష్ట్రలో ఉన్నారు. శుక్రవారం తన జన్మదినం రోజున మూసీ(Musi) పునరుజ్జీవన కార్యక్రమంలో బిజీగా గడిపిన ఆయన.. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లారు. ముంబైలో కాంగ్రెస్ నేతలను కలిశారు. అక్కడ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించారు. శనివారం రాత్రికే హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ఆదివారం ఉదయం మహబూబ్‌నగర్‌కు వెళ్లనున్నారు.

Next Story