CM Revanth Reddy: గృహజ్యోతి స్కీమ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్

by Prasad Jukanti |

గృహజ్యోతి స్కీమ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్ చేశారు.

CM Revanth Reddy: గృహజ్యోతి స్కీమ్ పై సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: పేదల ఇంట విద్యుత్ వెలుగులు పంచాలన్న ప్రజాప్రభుత్వ సంకల్పం సత్ఫలితాలు ఇస్తున్నదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న గృహ జ్యోతి పథకం (Gruha Jyothi) పై సోమవారం ఆయన ట్వీట్ చేశారు. సంక్షేమానికి కేరాఫ్ అడ్రస్ గా ఇందిరమ్మ పాలన నిలుస్తున్నదని ఒక్క హైదరాబాద్ నగరంలోనే 10.52 లక్షల కుటుంబాలు గృహ జ్యోతి పథకం కింద ప్రయోజనం పొందుతున్నాయని తెలిపారు. ఈ పరిణామం హర్షణీయం అని పేర్కొన్నారు. కాగా 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే గృహాలకు ఈ పథకం కింద ఉచిత విద్యుత్ ను (free current) ప్రభుత్వం అందిస్తున్న సంగతి తెలిసిందే.

Next Story