CM Revanth Reddy : కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ

by Y. Venkata Narasimha Reddy |

పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి అత్తగారైన కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి(Jhansi Reddy)ని హైదరాబాద్ లోని వారి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరామర్శించారు.

CM Revanth Reddy : కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి పరామర్శ
X

దిశ, వెబ్ డెస్క్ : పాలకుర్తి కాంగ్రెస్ ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డి అత్తగారైన కాంగ్రెస్ నాయకురాలు ఝాన్సీ రెడ్డి(Jhansi Reddy)ని హైదరాబాద్ లోని వారి నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) పరామర్శించారు. కొన్ని రోజుల క్రితం పాలకుర్తిలో జరిగిన ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవం సందర్భంగా వేదిక కుప్పకూలిన ప్రమాదంలో ఝాన్సీ రెడ్డి గాయపడ్డారు. ఝాన్సీ రెడ్డిని పరామర్శించిన రేవంత్ రెడ్డి ఆమె త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. సీఎం రేవంత్ రెడ్డి వెంట పీసీసీ చీఫ్ బి.మహేశ్ కుమార్ గౌడ్, సీఎం సలహాదారు వేంరెడ్డి నరేందర్ రెడ్డి, ఎమ్మెల్యే మామిడాల యశస్వినీ రెడ్డిలు కూడా ఉన్నారు.

Next Story