ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. రేపు సీడబ్ల్యూసీ మీటింగ్

by Ramesh Naini |

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరారు. రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు.

ఢిల్లీకి బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి.. రేపు సీడబ్ల్యూసీ మీటింగ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఢిల్లీకి బయలుదేరారు. రేపు జరగనున్న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ (సీడబ్ల్యూసీ) సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఈ సమావేశం నూతనంగా నిర్మించిన ఏఐసీసీ కార్యాలయం ఇందిరా భవన్‌లో రేపు (శనివారం) ఉదయం 10:30 గంటలకు నిర్వహించనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అధ్యక్షతన జరిగే ఈ కీలక సమావేశంలో దేశవ్యాప్తంగా రాజకీయ పరిస్థితులు, మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరు మార్పు, రానున్న ఎన్నికలు, పార్టీ వ్యూహాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో పలువురు సీనియర్ నేతలు, పార్టీ కీలక నాయకులు పాల్గొననున్నారు.

Next Story