తమ్ముడు రేవంత్ రెడ్డి ‘కాళేశ్వరం’పై ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు: కేఏపాల్

by Disha Web Desk 14 |
తమ్ముడు రేవంత్ రెడ్డి ‘కాళేశ్వరం’పై ఇన్వెస్టిగేషన్ చేయడం లేదు: కేఏపాల్
X

దిశ, డైనమిక్ బ్యూరో: గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భారీ అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కాళేశ్వరం ప్రాజెక్టుపై హైకోర్టులో విచారణ జరుగుతున్నది. ఇప్పటికే జ్యుడిషియల్ కమిటీ వేసినట్లు హైకోర్టుకు ప్రభుత్వం తెలిపిన సంగతి విదితమే. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ తాజాగా హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కేఏపాల్ వేసిన పిటిషన్‌ను చీఫ్ జస్టిస్ బెంచ్ అనుమతి ఇచ్చింది. వచ్చే మంగళవారం రోజు పూర్తి స్థాయి వాదనలు వింటామన్న న్యాయస్థానం. దీంతో తదుపరి విచారణ వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

ఈ సందర్భంగా హైకోర్టు వద్ద కేఏపాల్ మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజలకు నేడు ఒక మంచి శుభదినమని ప్రజాశాంతి పార్టీ చీఫ్ కేఏపాల్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని వివరించారు. ప్రాజెక్టుకు దాదాపు లక్షల కోట్లు ఖర్చయింది, 2019లో ప్రాజెక్టు ప్రారంభించారని చెప్పారు. తెలంగాణకు ప్రాజెక్టు వల్ల రెండు లక్షల కోట్లు అప్పు అయ్యిందని ఆరోపించారు. తమ్ముడు రేవంత్ రెడ్డి గతంలో ప్రాజెక్టుపై ఇన్వెస్టిగేషన్ చేస్తానని, సీబీఐ ఎంక్వైరీ వేస్తామని చెప్పారని గుర్తు చేశారు. కానీ ప్రాజెక్టు కాంట్రాక్టర్ మెఘా కృష్ణారెడ్డిని సీఎం రేవంత్ రెడ్డి గతంలో కలిసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం లేదని ఆరోపించారు. అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తమ్ముడు రేవంత్ రెడ్డి ప్రాజెక్టు ఎంక్వైరీ పై సీబీఐకి లెటర్ రాయలేదన్నారు. బీజేపీ స్టేట్ చీఫ్ కిషన్ రెడ్డి సీబీఐ ఎంక్వైరీకి తాము సిద్ధమని ..కానీ సీఎం రేవంత్ సీబీఐకి లెటర్ రాయాలని అనేక సార్లు అన్నారని గుర్తుచేశారు. ఈలోపే పార్టీలన్నింటికీ మెఘా కృష్ణారెడ్డి 12 వంద కోట్లు పార్టీలకు ఎలక్ట్రోబాండ్స్ రూపంలో ఇచ్చారని విమర్శించారు. దీంతో ఈ పార్టీలన్నీ కూడా ఒకటేనని కేఏపాల్ తేల్చిచెప్పారు.


Next Story

Most Viewed