సీఎం రేవంత్ రెడ్డి వల్లే బతికున్నా.. జోగిని సంచలన వ్యాఖ్యలు

by Disha Web Desk 5 |
సీఎం రేవంత్ రెడ్డి వల్లే బతికున్నా.. జోగిని సంచలన వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టాక తొలిసారి సొంత నియోజకవర్గానికి వెళ్లిన రేవంత్ రెడ్డి పలు అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. అనంతరం స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశం అయ్యారు. ఈ సమావేశంలో కోస్గి నియోజకవర్గానికి చెందిన హాజమ్మ అనే జోగిని సీఎం రేవంత్ రెడ్డి వల్లే నేను బ్రతికి ఉన్నాను అని మాట్లాడిన మాటలు అందరిని ఆశ్చర్యపరిచాయి.

ఆమె మాట్లాడుతూ.. జోగిని వ్యవస్థలో 500 మందికి పైగా చనిపోయారని వీరి రక్షణకై ఒక జీవో తీసుకొని రావాలని అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రేవంత్ రెడ్డి గారిని లెటర్ అందించానని, ఆ లెటర్ తీసుకొని అసెంబ్లీలో మాట్లడటం వల్ల జీవో వచ్చి మా బతుకులు బాగు పడ్డాయని, చనిపోదాం అనుకున్న నేను అసెంబ్లీలో రేవంత్ రెడ్డి మాటలు విని బ్రతుకుపై ఆశలు చిగురించాయని అన్నారు. తాను బ్రతికుండటానికి ప్రధాన కారణం సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు.

139 జీవో ద్వారా తల్లి పేరు, తండ్రి పేరు సమానమనే చైతన్యం తీసుకొచ్చిన ఘనత సీఎం రేవంత్ రెడ్డికే దక్కుతుందని, అలాగే జోగిని వ్యవస్థ ధీన గాదపై రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడటం వల్ల 27 జీవో వచ్చిందని, ఒంటరి మహిళల పించన్ రావడానికి ప్రధాన కారకులు రేవంత్ రెడ్డి అని కొనియాడారు. అంతేగాక జోగినిగా ఉన్న వాళ్లందరూ తలెత్తుకొని బతుకుతున్నారంటే దానికి రేవంత్ రెడ్డి గారే ప్రధాన కారణం అని ప్రశంసించారు. అలాగే రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక ప్రతినెల ఆరువేల బెన్ ఫిట్ పొందుతున్నామని తెలిపారు. స్వయం సహాయక సంఘాలు పెట్టాలని నిర్ణయించిన న్యూట్రిషన్ మిల్లుకు సహకరిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేశారు.

Next Story

Most Viewed