ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ

by Disha Web Desk 2 |
ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి బిజీ బిజీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో బిజీ బిజీగా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై వరుసగా కేంద్ర మంత్రులను కలువనున్నారు. ఈ క్రమంలోనే కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురితో సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. మరోవైపు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాతో సమావేశం కానున్నారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు నేపథ్యంలో జాతీయ హోదా కోరుతూ జల్ శక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్‌తో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమవ్వనున్నారు.



Next Story

Most Viewed