CM Revanth Reddy: నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులపై రానున్న క్లారిటీ?

by Disha Web Desk 1 |
CM Revanth Reddy: నేడు ఢిల్లీకి వెళ్లనున్న సీఎం రేవంత్‌రెడ్డి.. ఆ మూడు స్థానాల్లో అభ్యర్థులపై రానున్న క్లారిటీ?
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేడు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఏఐసీసీ ఎన్నికల కమిటీ మీటింగ్‌ ఆయన ముఖ్య నేతలతో కలిసి పాల్గొనున్నారు. ఈ సందర్భంగా మూడో జాబితాపై కాంగ్రెస్ ముఖ్య నాయకులతో రేవంత్ చర్చించనున్నారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో 14 ఎంపీ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్థులను ప్రకటించిన విషయం తెలిసిందే. మిగిలిన 3 స్థానాలకు సంబంధించి అభ్యర్థుల ఎంపికపై నేడు కాంగ్రెస్ అధిష్టానం కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈ భేటీ అనంతరం అభ్యర్థుల ఎంపిక ప్రకటన రానుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.



Next Story

Most Viewed