నిఖత్ జరీన్ కు రూ.2 కోట్లు ప్రకటించిన కేసీఆర్

by Dishafeatures2 |
నిఖత్ జరీన్ కు రూ.2 కోట్లు ప్రకటించిన కేసీఆర్
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాబోయే ఒలింపిక్స్ క్రీడల్లో నిఖత్ జరీన్ స్వర్ణాన్ని సాధించి తెలంగాణ సహా భారత దేశ ఘనకీర్తిని మరోసారి విశ్వానికి చాటాలని సీఎం కేసీఆర్ ఆకాంక్షించారు. బాక్సర్ నిఖత్ జరీన్ రాష్ట్ర సచివాలయంలో గురువారం కేసీఆర్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ ..ప్రపంచ వేదికలపై విజయాలను సొంతం చేసుకుంటూ దేశ ప్రతిష్టను ఇనుమడింప చేసిన నిఖత్ జరీన్ కు రాబోయే ఒలంపిక్ పోటీల్లో పాల్లొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం సంపూర్ణ సహకారం అందజేస్తుందని అన్నారు. ఒలంపిక్ క్రీడల్లో పాల్గొనేందుకు తీసుకునే శిక్షణ, కోచింగ్, రవాణా తదితర ఖర్చులను రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని హామీ ఇచ్చారు. ఖర్చుల కోసం రూ.2 కోట్లు ప్రకటించారు.

ఇందుకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సమావేశంలో క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, మంత్రులు మహమూద్ అలీ, ప్రశాంత్ రెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, బాల్క సుమన్, విఠల్ రెడ్డి, సీఎంవో కార్యదర్శి భూపాల్ రెడ్డి, క్రీడాశాఖ కార్యదర్శి సందీప్ సుల్తానియా తదితరులు పాల్గొన్నారు.



Next Story