- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీఆర్ఎస్ నాయకులు గూండాల మాదిరి వ్యవహరిస్తున్నారు: భట్టి
దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ నాయకులు గుండాల మాదిరిగా వ్యవహరిస్తున్నారని కాంగ్రెస్ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీ నాయకులపై భౌతిక దాడులకు దిగడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టుగా మారిందన్నారు. ఇటీవల దుండగుల దాడిలో గాయపడి సికింద్రాబాద్ అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కాంగ్రెస్ యూత్ లీడర్ తోట పవన్ను గురువారం ఆయన పరామర్శించారు. పవన్ ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ.. రాష్ట్రంలో అరాచక, అప్రజాస్వామిక పాలన సాగుతోందని మండిపడ్డారు.
బీఆర్ఎస్ నాయకుల తీరు చూస్తుంటే అసలు రాష్ట్రంలో శాంతి, భద్రతలు ఉన్నాయా అన్న అనుమానం కలుగుతోందని అన్నారు. తోట పవన్ పై దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేన రెడ్డి మాట్లాడుతూ తోట పవన్ పై బీఆర్ఎస్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అనుచర వర్గం దాడికి పాల్పడ్డారని అన్నారు. అయితే అసలు నిందితులను తప్పించి ఈ కేసుతో సంబంధం లేని వారిని ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు.