Nagarjuna Sagar: సాగర్‌లో తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య గొడవ

by Disha Web Desk 2 |
Nagarjuna Sagar:  సాగర్‌లో తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య గొడవ
X

దిశ, వెబ్‌డెస్క్: నాగార్జున సాగర్‌లో తెలుగు రాష్ట్రాల పోలీసుల మధ్య వివాదం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ సివిల్ పోలీసులు, తెలంగాణ ఎస్‌పీఎఫ్ పోలీసులకు మధ్య గొడవ జరిగింది. రాత్రి వేళ డ్యామ్‌పైకి వచ్చేందుకు ఏపీ రైట్‌బ్యాంక్ ఎస్ఐ ప్రయత్నించాడు. సాయంత్రం ఆరు గంటల తర్వాత ప్రాజెక్టు అధికారులకు తప్ప ఇతరులెవరికీ డ్యామ్‌పైకి అనుమతి లేదని తెలంగాణ ఎస్‌పీఎఫ్ పోలీసులు ఏపీ ఎస్ఐని అడ్డుకున్నారు. అనంతరం ఏపీ పరిధిలోకి వెళ్లిన తెలంగాణ పోలీసుల వాహనాలకు ఏపీ పోలీసులు చలాన్లు విధించారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య భారీ వాగ్వాదం జరిగి, గొడవ ఉన్నతాధికారుల వద్దకు చేరింది. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు విషయం బయటకు పొక్కకుండా రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, గత ఆరు రోజులుగా ఏపీ-తెలంగాణ పోలీసుల మధ్య ఈ తరహా గొడవలు జరుగుతున్నట్లు సమాచారం.


Next Story