కొడంగల్‌లో BRS, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ

by Satheesh |   (  Updated:2023-11-30 09:40:53  IST  )

బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని రేగడి మైలారంలోని ఓ పోలింగ్ స్టేషన్‌కు

కొడంగల్‌లో BRS, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణ
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య ఘర్షణతో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఇలాకా కొడంగల్ నియోజకవర్గంలో హై టెన్షన్ నెలకొంది. నియోజకవర్గ పరిధిలోని రేగడి మైలారంలోని ఓ పోలింగ్ స్టేషన్‌కు బీఆర్ఎస్ అభ్యర్థి పట్నం నరేందర్ రెడ్డి వెళ్లారు. ఓటర్లను ప్రలోభ పెట్టేందుకే వచ్చారంటూ కాంగ్రెస్ కార్యకర్తలు ఆందోళన చేశారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు వారితో గొడవకు దిగారు. ఈ క్రమంలో అక్కడి ఉద్రిక్తత నెలకొంది. రంగ ప్రవేశం చేసిన పోలీసులు ఇరు వర్గాలను సముదాయించారు. కాగా, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కొడంగల్‌ నుండి బరిలో ఉండటంతో ఈ నిజయోజకవర్గం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది.

Next Story