HYD: నిర్వాహకులకు అలర్ట్.. గణపతి మండపంలో డీజేకు అనుమతిపై క్లారిటీ

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-19 13:33:03  IST  )

గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను పోలీసులు(Telangana Police) విడుదల చేశారు.

HYD: నిర్వాహకులకు అలర్ట్.. గణపతి మండపంలో డీజేకు అనుమతిపై క్లారిటీ
X

దిశ, వెబ్‌డెస్క్: గణపతి నవరాత్రుల సందర్భంగా నిర్వాహకులు పాటించాల్సిన నిబంధనలను పోలీసులు(Telangana Police) విడుదల చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ప్రకటన చేశారు. నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని పేర్కొన్నారు. ట్రాఫిక్‌కు అంతరాయం లేకుండా మండపాలు(Ganpati Mandapam) ఏర్పాటు చేసుకోవాలని చెప్పారు. డీజే పర్మిషన్ లేదని గుర్తుంచుకోవాలని హితవు పలికారు. నిర్వాహకులు తప్పనిసరిగా https://policeportal.tspolice.gov.in/index.htmలో పర్మిషన్‌ కోసం అప్లై చేసుకొని, అనుమతి తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు.

పోలీసుల నిబంధనలు :

• మండపం ఏర్పాటు కోసం అనుమతి తప్పనిసరి

• కరెంట్ కనెక్షన్ కోసం DD తప్పనిసరి

• విద్యుత్‌కు అధికారుల పర్మిషన్ తప్పనిసరి

• మండపాల కోసం రోడ్లను పూర్తిగా బ్లాక్ చేయొద్దు

• డీజేలకు అస్సలు అనుమతి లేదు

• రాత్రి 10 గంటల తర్వాత మైక్ వాడొద్దు

• మండపాల దగ్గర సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోండి

• వర్షాలను దృష్టిలో పెట్టుకొని ఏర్పాట్లు చేసుకోవాలి

• ఫైర్ సేఫ్టీ నిబంధనలను పాటించాలి

• భక్తుల తాకిడికి తగినట్లు మండపాల దగ్గర ఏర్పాట్లు తప్పనిసరి

• వాహనాలు పార్క్ చేసుకోవడానికి ప్రత్యేక స్థలాలు ఏర్పాటు చేయాలి

• అనుమానాస్పద వ్యక్తుల కదలికలు పోలీసులకు తెలియజేయాలి

• అధికారిక నిమజ్జన స్థలాలు మాత్రమే వినియోగించాలి

• పోలీస్ ఇచ్చిన అనుమతి కాపీని మండపంలో కనపడేలా ప్రదర్శించాలి

Next Story