చరిత్ర ఉన్నంత కాలం TDP ఉంటుంది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
చరిత్ర ఉన్నంత కాలం TDP ఉంటుంది: చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో టీడీపీకి పూర్వవైభవం తీసుకురావడమే లక్ష్యంగా తెలంగాణ టీడీపీ చేపట్టిన ‘‘ఇంటింటికీ తెలుగుదేశం’’ కార్యక్రమాన్ని పార్టీ జాతీయ అధినేత చంద్రబాబు నాయుడు ప్రారంభించారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ భవన్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి చంద్రబాబు హాజరై మాట్లాడారు. ఇంటింటికి తెలుగుదేశం కిట్లను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ 41ఏళ్లుగా తెలుగు వారి కోసం పని చేస్తోందని అన్నారు. తెలంగాణో ప్రతిఒక్కరూ టీడీపీని గుండెల్లో పెట్టుకున్నారన్నారు.

తెలంగాణ గడ్డపైనే ఎన్టీఆర్ టీడీపీని ఏర్పాటు చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు. తెలుగు వారి ఆత్మగౌరవాన్ని కాపాడేందుకే టీడీపీని స్థాపించారని తెలిపారు. యువత, మహిళలకు టీడీపీ పెద్ద పీట వేస్తోందని పేర్కొన్నారు. కార్యకర్తలు సమిష్టిగా పనిచేసి తెలంగాణలో టీడీపీ పూర్వవైభవం తీసుకురావాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌ను ఐటీలో అగ్రగామిగా తీర్చిదిద్దిన ఘనత టీడీపీదేనని అన్నారు. సైబరాబాద్‌ను నిర్మించిన ఘనత టీడీపీదేనని పేర్కొన్నారు. తెలంగాణలో టీడీపీ ఎక్కడుందనే వారికి ఖమ్మం సభే సమాధానమన్నారు.

చరిత్ర ఉన్నంత వరకు టీడీపీ ఉంటుందన్నారు. టీ- టీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ఆధ్వర్యంలో తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరుగులు పెడుతోందని ప్రశంసలు కురిపించారు. తెలంగాణలో వచ్చే ఎన్నికల్లో టీడీపీ నుండి మొదటి సీటు నాయి బ్రహ్మణులకు.. రెండవ సీటు రజకులకు ఇస్తామని స్పష్టం చేశారు. టీ టీడీపీకి యువత అండగా ఉండాలని చంద్రబాబు కోరారు.



Next Story

Most Viewed