BREAKING: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు..!

by Disha Web Desk 19 |
BREAKING: బీజేపీ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు..!
X

దిశ, వెబ్‌డెస్క్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్‌పై కేసు నమోదు అయ్యింది. ఇటీవల చెంగిచెర్లలో పోలీసు విధులకు ఆటంకం కలిగించారని నాచారం సీఐ నందీశ్వర్రెడ్డి బండి సంజయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు బండి సంజయ్‌పై పోలీసులు కేసు ఫైల్ చేశారు. బండితో పాటు మరో 9 మందిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యాయి. కాగా, హాళీ పండుగ సందర్భంగా చెంగిచెర్లలో రెండు వర్గాల మధ్య ఘర్షణలు జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఓ వర్గానికి చెందిన వారు కొందరు తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో బాధితులను పరామర్శించేందుకు బుధవారం ఎంపీ బండి సంజయ్ చెంగిచెర్లకు వెళ్లారు. శాంతిభద్రతల సమస్య తలెత్తే నేపథ్యంలో బండి సంజయ్‌ పర్యటనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. బారికేడ్లు అడ్డుపెట్టి ఎక్కడిక్కకడ బీజేపీ శ్రేణులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, బీజేపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ ఘటనపైనే తాజాగా పోలీసులు బండి సంజయ్‌తో పాటు మరో 9 మందిపై కేసు నమోదు చేశారు.


Next Story

Most Viewed