'ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే' : R S Praveen Kumar

by Disha Web Desk 2 |
ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్యే : R S Praveen Kumar
X

దిశ, వెబ్‌డెస్క్: కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్ మండలం బొల్లారం గ్రామానికి చెందిన వీఆర్ఏ బోరాబోయిన అశోక్(25) గ్రామ పొలిమేరలో చెట్టుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. దీనిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ.. సర్కార్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ''ఇది ముమ్మాటికి కేసీఆర్ ప్రభుత్వం చేసిన హత్య. ఇప్పటికీ 5 మంది VRAలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రాణ త్యాగం చేసిండ్రు. అయినా ఈ దోపిడీ ప్రభుత్వం దిగి రావడం లేదు. పక్క రాష్ట్రాల్లో రైతులు కనుపిస్తున్న కేసీఆర్‌కు మన రాష్ట్రం ప్రజలు కనిపిస్తలేరు. ఈ టీఆర్ఎస్ పార్టీని పాతి పెట్టాల్సిందే.'' అంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర విమర్శలు చేశారు.



Next Story

Most Viewed