'ఇలాంటి రాబందులతోనా కామ్రేడ్లు చేతులు కలిపేది?'

by Disha Web Desk 2 |
ఇలాంటి రాబందులతోనా కామ్రేడ్లు చేతులు కలిపేది?
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ మద్యం పాలసీ కుంభకోణానికి సంబంధించి ఆదివారం సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. బీజేపీ నాయకులు టీఆర్ఎస్‌పైనా, తెలంగాణ సీఎం కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితపైనా నేరుగా ఆరోపణలు చేశారు. ఇందులో కవిత భర్త తరపు బంధువుల ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్లు ఆధారాలు బయటపెట్టారు. దీనిపై బీఎస్పీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తీవ్రంగా స్పందించారు. ''ఛీ ఛీ.. ఈ దోపిడీ దొంగల కోసమేనా 1300 అమరవీరులు ప్రాణత్యాగం చేసింది? ఇటువంటి రాబందులతోనా కామ్రేడ్లు చేతులు కలిపేది? ప్రగతిభవన్ల ఎన్ని కోట్లు చేతులు మారినయ్? కమ్యూనిష్టు బహుజన బిడ్డలారా, మీ అగ్రవర్ణ నాయకులు ఎప్పుడో భూస్వాములకు బానిసలయ్యిండ్రు. ఇప్పుడైనా కళ్లుతెరచి మన బీఎస్పీ గూటికి రండి'' అంటూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ట్విట్టర్ వేదికగా కమ్యూనిస్టులకు పిలుపునిచ్చారు.


Next Story

Most Viewed