ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన BRS.. కారణమిదే..!

by Disha Web Desk 4 |
ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించిన BRS.. కారణమిదే..!
X

దిశ, వెబ్‌డెస్క్: కారును పోలిన గుర్తులను ఈసీ ఫ్రీ సింబల్స్ నుంచి తొలగించాలని కోరుతూ బీఆర్ఎస్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. ఈ మేరకు ఢిల్లీ హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేసింది. రోడ్డు గుర్తు కారును పోలి ఉండటంతో ఎన్నికల్లో తమకు నష్టం కలుగుతోందని పిటిషన్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. ఈ పిటిషన్‌పై ఢిల్లీ హై కోర్టు నేడు(గురువారం) విచారణ చేపట్టనుంది. కారు గుర్తును పోలిన కెమెరా, చపాతి రోలర్, సోప్ డిష్, టెలివిజన్, కుట్టుమిషన్, ఓడ, ఆటోరిక్షా, ట్రక్ వంటి గుర్తులతో తమకు నష్టం జరుగుతోందని ఈ గుర్తులను ఎవరికీ కేటాయించొద్దని బీఆర్ఎస్ గతంలో ఈసీని కోరింది. ఈసీ బీఆర్ఎస్ రిక్వెస్ట్‌లపై స్పందించకపోవడంతో ఢిల్లీ హైకోర్టును పార్టీ ఆశ్రయించింది.

Next Story