‘కేసీఆర్ రంగంలోకి దిగిండు.. ఇక రేవంత్ ఆటలు సాగవు’

by Disha Web Desk 2 |
‘కేసీఆర్ రంగంలోకి దిగిండు.. ఇక రేవంత్ ఆటలు సాగవు’
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీరియస్ కామెంట్స్ చేశారు. గురువారం కేసీఆర్ ప్రమాణ స్వీకారం తర్వాత పాడి కౌశిక్ రెడ్డి, మాణిక్ రావు మీడియాతో మాట్లాడారు. ఫిబ్రవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ వేస్తానన్న రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఎమ్మెల్యేగా కేసీఆర్ ప్రమాణం చేశారని.. కొత్త ఇన్నింగ్స్ మొదలు కాబోతున్నాయి.. రెడీ ఉండండి.. ఇక రేవంత్ ఆటలు సాగవని కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేశారు. ఉద్యోగాలపై సీఎం రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. అబద్ధాల పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని అన్నారు. రేవంత్ రెడ్డికి హరీష్ రావు ఏమైనా పోలిక ఉందా? అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ హయంలో హరీష్ రావు చేసిన పనులను కాంగ్రెస్ ప్రభుత్వం తన ఖాతాలో వేసుకుంటుందని అన్నారు.

హరీష్ రావు ఉదయం 6 గంటలకు నుంచి రాత్రి 2 గంటల వరకు ప్రజల్లో ఉండే వ్యక్తి అని.. ఆయనకు ఎవరితోనూ పోలిక ఉండదని అన్నారు. కేవలం హరీష్ రావు కృషి వల్లే నర్సులకు ఉద్యోగాలు వచ్చాయని అన్నారు. ఇచ్చిన మాట ప్రకారం వెంటనే రెండు లక్షల ఉద్యోగాలకు రేవంత్ రెడ్డి నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్ష నేత అయిన కేసీఆర్‌ను బొంద పెడతా అని సీఎం స్థానంలో ఉన్న వ్యక్తి మాట్లాడొచ్చా అని అడిగారు. రేవంత్ రెడ్డి కొంచెం సీఎంలా ప్రవర్తించడం నేర్చుకోవాలి అని హితవు పలికారు. కేసీఆర్ పనితీరు గురించి రాష్ట్రం మొత్తం తెలుసని.. ముందు కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీల అమలపై దృష్టి పెట్టాలని అన్నారు. రాష్ట్ర ప్రజలు ఎవరూ 200 యూనిట్ల వరకు కరెంట్ బిల్లు కట్టొద్దని పిలుపునిచ్చారు.



Next Story