ఆ యువతితో బంధుత్వంపై స్పందించిన BRS మాజీ ఎంపీ

by Disha Web Desk 2 |
ఆ యువతితో బంధుత్వంపై స్పందించిన BRS మాజీ ఎంపీ
X

దిశ, వెబ్‌డెస్క్: కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జెన్‌కోలో జరిగిన అవకతవకలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ప్రస్తుతం మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ తన బంధువైన యువతికి జెన్‌కోలో భారీ వేతనంతో యువతికి ఉద్యోగం ఇప్పించాడని వస్తున్న వార్తలు దుమారం రేపుతున్నాయి. ఎలాంటి రాత పరీక్ష లేకుండా సరిత అనే యువతికి అసిస్టెంట్ ఇంజినీర్ పోస్టును కట్టబెట్టారని నిరుద్యోగులు మండిపడుతున్నారు. తాజాగా.. ఈ వార్తలపై వినోద్ కుమార్ స్పందించారు.

ఇంటిపేర్లు సేమ్ ఉన్నంత మాత్రానా అందరూ బంధువులు అవుతారా? అని ప్రశ్నించారు. ఆ యువతికి తమకు ఎలాంటి సంబంధం లేదని కొట్టిపారేశారు. ప్రభాకర్ రావు ఉద్యోగం ఇచ్చిన బోయినపల్లి సరితకు తమ కుటుంబానికి ఎలాంటి సంబంధం లేదని తేల్చి చెప్పారు. కావాలనే పనిగట్టుకొని కాంగ్రెస్, బీజేపీలు అసత్య ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. అలా అయితే ప్రధాని మోడీ, నీరవ్ మోడీ కూడా బంధువులే అవుతారని సీరియస్ అయ్యారు. ఒకవేళ ఆ యువతికి ఉద్యోగం నేను ఇప్పించానని రుజువు చేయగలిగితే దేనికైనా సిద్ధమని సవాల్ చేశారు.

Next Story