బీజేపీవి దిగజారుడు రాజకీయాలు.. బీఆర్ఎస్ నేత దాసోజు

by Dishafeatures2 |
బీజేపీవి దిగజారుడు రాజకీయాలు.. బీఆర్ఎస్ నేత దాసోజు
X

దిశ, వెబ్ డెస్క్: బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కు రూ.75 కోట్లు ఇచ్చినట్లు సుఖేశ్ చేసిన ఆరోపణలను బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ ఖండించారు. కేసీఆర్ ప్రతిష్టను దెబ్బ తీసేందుకు బీజేపీ కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. జైలులో ఉన్న వ్యక్తి లేఖ ఎలా రాశాడంటూ ప్రశ్నించారు. బీజేపీ కుట్రలను తిప్పికొడతామని తెలిపారు. కాగా మనీ లాండరింగ్ కేసులో తీహార్ జైలులో ఉన్న సుఖేశ్ చంద్రశేఖర్ సంచలన ఆరోపణలు చేశారు. ఈ మేరకు తీహార్ జైలు నుంచి ఆయన ఓ లేఖ విడుదల చేశారు.

ఢిల్లీ లిక్కర్ కేసుకు సంబంధించి ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, సత్యేంద్ర జైన్ ఆదేశాల మేరకు తెలంగాణ సీఎం కేసీఆర్ కు రూ.75 కోట్లు ఇచ్చినట్లు సంచలన ఆరోపణలు చేశారు. రూ.15 కోట్ల చొప్పున ఐదు సార్లు రూ. 75 కోట్లు కేసీఆర్ అప్పజెప్పానని చెప్పాడు. ఈ 75 కోట్లలో రూ.15 కోట్లు బీఆర్ఎస్ కార్యాలయం ముందు ఓ రేంజ్ రోవర్ కారులో ఉన్న వ్యక్తిగా ఇచ్చినట్లు తెలిపాడు.


Next Story

Most Viewed