బీఆర్ఎస్ ‘బీసీ గర్జన’ సభ వాయిదా.. ప్రకటించిన మాజీ మంత్రి తలసాని

by Kema Shiva Kumar |

స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న కరీంనగర్‌లో బీసీ గర్జనకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే.

బీఆర్ఎస్ ‘బీసీ గర్జన’ సభ వాయిదా.. ప్రకటించిన మాజీ మంత్రి తలసాని
X

దిశ, వెబ్‌డెస్క్: స్థానిక సంస్థలతో పాటు విద్య, ఉద్యోగ రంగాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలనే డిమాండ్‌తో బీఆర్‌ఎస్‌ (BRS) పార్టీ ఆధ్వర్యంలో ఈనెల 8న కరీంనగర్‌లో బీసీ గర్జనకు ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ నెల 8న నిర్వహించనున్న బీసీ గర్జన సభకు 14కు వాయిదా వేస్తున్నట్లుగా బీఆర్ఎస్ ముఖ్య నేత, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస రావు వెల్లడించారు. భారీ వర్షాల నేపథ్యంలో సభను వాయిదా వేయాల్సి వచ్చిందని పేర్కొన్నారు. ఈ నెల 14నే మిగతా సభల తేదీలను కూడా ప్రకటిస్తామని తెలిపిన తలసాని తెలిపారు.

Next Story