అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనది: Tamilisai Soundararajan

by Disha Web Desk 19 |
అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనది:  Tamilisai Soundararajan
X

దిశ, వెబ్‌డెస్క్: రాఖీ ఫర్ సోల్జర్స్ ఎంతో ముఖ్యమైన కార్యక్రమమని తెలంగాణ గవర్నర్ తమిళి సై అన్నారు. బుధవారం రాజ్ భవన్‌లో సంస్కృతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో రాఖీ ఫర్ సోల్జర్స్ అనే కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అన్నా చెల్లెళ్లు మాత్రమే కాకుండా ప్రజలు కూడా రాఖీ పండుగ జరుపుకుంటారని అన్నారు. అన్నా చెల్లెళ్ల అనుబంధం ఎంతో ఆత్మీయమైనదన్నారు. దేశ కోసం ప్రాణాలు తెగించి పోరాడుతోన్న సైనికుల గురించి పిల్లలు తెలుసుకోవాలని ఈ సందర్భంగా గవర్నర్ తమిళి సై సూచించారు.

Next Story

Most Viewed