- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు అరెస్ట్.. కారణం అదే!
పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు.

X
దిశ, వెబ్డెస్క్: పటాన్చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి సోదరుడు ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వ భూమిలో అక్రమ మైనింగ్ చేపడుతున్నారనే ఫిర్యాదుతో వారు కేసు నమోదు చేసి ఇవాళ ఆయనను అరెస్ట్ చేశారు. కాగా, సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం పరిధిలోని లగ్దారంలో మైనింగ్కు భూమిని మధుసూదన్ లీజుకు తీసుకున్నాడు. అయితే, పరిమితికి మించి తవ్వకాలు జరిపారని మధసుదన్పై అధికారులు ఇటీవలే పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమతుల గడువు ముగిసినప్పటికీ మైనింగ్ కొనసాగించారని గుర్తించి అధికారులు మధుసుదన్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా మధుసూదన్ రెడ్డి అరెస్ట్తో ఆయన అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పోలీస్ స్టేషన్కు చేరుకున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






