BREAKING: ముస్లింలను తిడుతూ.. మోడీ ఓట్లు దండుకుంటుండు : అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |

ముస్లింలను తిడుతూ మోడీ ఓట్లు దండుకుంటున్నాడని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.

BREAKING: ముస్లింలను తిడుతూ.. మోడీ ఓట్లు దండుకుంటుండు : అసదుద్దీన్ ఓవైసీ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: ముస్లింలను తిడుతూ మోడీ ఓట్లు దండుకుంటున్నాడని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముస్లింలను తిడుతూ ఓట్లు దండుకుంటున్నారని.. ఆ పద్ధతినే ఆయన 2002 నుంచే ఫాలో అవుతూ వస్తున్నారని ఆరోపించారు. మోడీ అసలు గ్యారంటీ ముస్లింలను తట్టడమేనా అని ఎద్దేవా చేశారు. నేటికి ముస్లింలను బీజేపీ చొరబాటుదారులుగానే చూస్తున్నారని మండిపడ్డారు. దేశ సంపదను కార్పొరేట్లకు పంచిన ఘనతన మోడీకే దక్కుతుందని అన్నారు. కేవలం అబద్ధాలు చెబుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన మేనిఫెస్టోకి అన్ని వర్గాల నుంచి అద్భుత స్పందన లభిస్తోందని అన్నారు. దేశం ప్రస్తుతం సమస్యలపై ఓటు వేయాలనుకుంటోందని అసద్దుద్దీన్ స్పష్టం చేశారు.

Next Story