BREAKING: కేసీఆర్ పని ఒడిశింది.. ఇక మళ్లీ అధికారంలోకి రాలేడు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్

by Disha Web Desk 1 |
BREAKING: కేసీఆర్ పని ఒడిశింది.. ఇక మళ్లీ అధికారంలోకి రాలేడు: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ పని ఒడిశింది.. ఆయన మళ్లీ అధికారంలోకి రాలేడంటూ కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కామెంట్ చేశారు. కాసేపటి క్రితం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల పాటు అధికారాన్ని అనుభవించిన కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని ఆర్థికంగా లూఠీ చేశారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఆనాడు అలా బీఆర్ఎస్ దోచుకుంటే.. నేడు సాధ్యం కాని హమీలతో ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తుందంటూ మండిపడ్డారు. లోక్‌సభ ఎన్నికల ముందు కేసీఆర్ బస్సు యాత్రకు తెరలేపారని, అసలు ఆ యాత్ర ఆయన ఎందుకు చేస్తున్నాడో తెలియదంటూ ఎద్దేవా చేశారు. ఇక ఎన్ని యాత్రలు చేసినా.. బీఆర్ఎస్ పార్టీని తెలంగాణ ప్రజలకు నమ్మే పరిస్థితుల్లో లేరని స్పష్టం చేశారు. ఆయన పని ఒడిశిందని.. ఇక రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదంటూ ఓ రేంజ్‌లో ఫైర్ అయ్యారు. అదేవిధంగా ఈ నెల 25న కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాష్ట్రానికి రాబోతున్నారని తెలిపారు. ఏదైనా ఓ పార్లమెంట్ సెగ్మెంట్‌లో బహిరంగ సభకు ప్లాన్ చేస్తున్నామని కిషన్‌రెడ్డి తెలిపారు.

Read More...

కేసీఆర్ పార్టీలో ఉండాలంటే బానిసగా బతకాలి.. కొండా విశ్వేశ్వర్ కామెంట్స్



Next Story

Most Viewed