BREAKING: కవిత జైలుకెళ్లడంతో కేటీఆర్, కేసీఆర్‌కు మతిభ్రమించింది: మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి

by Disha Web Desk 1 |
BREAKING: కవిత జైలుకెళ్లడంతో కేటీఆర్, కేసీఆర్‌కు మతిభ్రమించింది: మంత్రి కోమటి‌రెడ్డి వెంకట్‌రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో కవిత జైలుకెళ్లడంతో కేటీఆర్, కేసీఆర్‌కు మతిభ్రమించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఇవాళ మిర్యాలగూడలో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తాను కేసీఆర్‌లా దొంగ దీక్షలు చేయలదేని, ఏకంగా మంత్రి పదవిని త్యాగం చేసి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం దీక్ష చేశానని గుర్తు చేశారు. రేవంత్‌రెడ్డి బీజేపీలో చేరుతారంటూ పిచ్చిపిచ్చిగా మాట్లాతున్నారని మండిపడ్డారు. పదేళ్ల పాటు రాష్ట్రాన్ని కేసీఆర్ కుటుంబం లూఠీ చేసిందని తెలిపారు. వారు తిన్న ప్రజాధనాన్ని కక్కిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర ఆర్ధిక వ్యవస్థను విచ్ఛిన్నం చేశారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుబారాను తగ్గించే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం కృషి చేస్తోందని పేర్కొన్నారు.


Next Story

Most Viewed