BREAKING: ‘అరెయ్..! ఎంపీగా ఉండి నువ్వు ఏం పీ..నవో’ చెప్పాలె: సీఎం రేవంత్‌‌‌పై డీకే అరుణ వివాదాస్పద వ్యాఖ్యలు

by Disha Web Desk 1 |
BREAKING: ‘అరెయ్..! ఎంపీగా ఉండి నువ్వు ఏం పీ..నవో’ చెప్పాలె: సీఎం రేవంత్‌‌‌పై డీకే అరుణ వివాదాస్పద వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: మర్యాద లేకుండా మాట్లాడితే సహించేది లేదని మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ సీఎం రేవంత్‌రెడ్డిపై ఓ రేంజ్ ఫైర్ అయ్యారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. బాధ్యతయుతమైన పదవిలో ఉన్న సీఎం రేవంత్‌రెడ్డి ఓ ప్రెస్‌మీట్‌లో తనను దొరసాని అంటూ మాట్లాడటం తనను తీవ్రంగా భాధించిందని అన్నారు. ఓ మహిళను పట్టుకుని అగౌరవంగా మాట్లాడుతున్న సీఎం‌ను ప్రజలు గమనిస్తున్నారని హితవు పలికారు. ఇక నుంచి వ్యక్తిగత దూషణలకు దిగితే.. ఏ మాత్రం సహించేది లేదని స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తన గురించి మాట్లాడే కనీస అర్హత రేవంత్‌రెడ్డికి లేదంటూ ఫైర్ అయ్యారు.

తెలివి ఉండి మాట్లాడాలని.. తెలివి లేని మాటలు మాట్లాడొద్దంటూ క్లాస్ పీకారు. పాలమూరు జిల్లా వ్యక్తి సీఎం అయ్యాడంటూ ఇన్నాళ్లు సంతోషపడ్డానని, కానీ ఆయన మాట తీరు చూసి సిగ్గుపడుతున్నానని అన్నారు. తాను రాజకీయపరంగా విమర్శలు చేస్తానే తప్పా.. ఏ నాడు ఎవరిపై వ్యక్తిగత దూషణలకు పాల్పడలేదని అన్నారు. ఎమ్మెల్యేగా, ఎంపీగా పనిచేసిన రేవంత్‌రెడ్డి ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు నువ్వు ఏం పీ..నవ్’ చెప్పాలంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టును తీసుకొచ్చిందే డీకే అరుణ అని.. ఆనాడు రేవంత్‌రెడ్డి ఏడున్నాడంటూ ప్రశ్నించారు.



Next Story

Most Viewed