BREAKING: ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత

by Disha Web Desk 1 |
BREAKING: ఏసీబీ వలలో జీహెచ్ఎంసీ ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టివేత
X

దిశ, వెబ్‌డెస్క్: లంచం తీసుకుంటూ మరో అధికారి ఏసీబీ అధికారులకు చిక్కిన ఘటన హైదరాబాద్ పట్టణంలో చోటుచేసుకుంది. జీహెచ్ఎంసీ పరిధిలోని సరూర్‌నగర్ సర్కిల్ కార్యాలయంలో రాధాకృష్ణ అనే అధికారి ట్యాక్స్ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే, ఓ పని నిమిత్తం లంచం డిమాండ్ చేస్తున్నాడనే బాధితుడి ఫిర్యాదు మేరకు సమాచారం అందుకు ఏసీబీ అధికారులు సరూర్‌నగర్ జీహెచ్‌ఎంసీ సర్కిల్ కార్యాలయానికి వెళ్లి మాటు వేశారు. అక్కడ బాధితుడి నుంచి రాధాకృష్ణ రూ.8 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం అతడిని అరెస్ట్ చేసి ఏసీబీ కోర్టులో అధికారులు హాజరుపరిచారు.


Next Story

Most Viewed