BREAKING: కాంగ్రెస్ గ్యారెంటీలకే గ్యారెంటీ లేదు : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ

by Disha Web Desk 1 |
BREAKING: కాంగ్రెస్ గ్యారెంటీలకే గ్యారెంటీ లేదు : మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ
X

దిశ, వెబ్‌డెస్క్: ఆరు గ్యారెంటీల పేరుతో రాష్ట్రంలో ప్రజలను కాంగ్రెస్ మోసం చేసిందంటూ మహబూబ్‌నగర్ బీజేపీ ఎంపీ అభ్యర్థి డీకే అరుణ ఆరోపించారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడుతూ.. తప్పుడు హమీలతో కాంగ్రెస్ తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ఫైర్ అయ్యారు. తెలంగాణ ప్రజలకు మోసం చేసింది చాలక, ఇప్పుడు ఐదు గ్యారెంటీల పేరుతో దేశ ప్రజలకు తప్పుదోవ పట్టించేలా ఆ పార్టీ మేనిఫేస్టో విడుదల చేసిందంటూ ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీయే లేకుండా పోయిందని, ఇక దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమిటో అందరికీ తెలుసంటూ చురకలంటించారు. ఎన్నికల సందర్భంగా తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసేలా కాంగ్రెస్ వెంటే పడుతామని అన్నారు. కాంగ్రెస్ గ్యారెంటీలకే గ్యారెంటీ లేదంటూ ఆమె సెటైర్లు వేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రజల సంక్షేమాన్నే కోరుకుంటే.. పాలమూరు పాత డీపీఆర్‌కు అనుమతులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. ఇక ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదాపై తాను కేంద్రంతో మాట్లాడతానని డీకే అరుణ స్పష్టం చేశారు.



Next Story