బ్రేకింగ్ : ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు స్పాట్ డెడ్

by Disha Web Desk 4 |
బ్రేకింగ్ : ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు.. ముగ్గురు స్పాట్ డెడ్
X

దిశ, దంతాలపల్లి: రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందిన ఘటన తిరుపతి -శ్రీ కాళహస్తి ప్రధాన రహదారిపై చోటు చేసుకుంది. దంతాలపల్లి మండల కేంద్రానికి చెందిన నెమ్మది అశోక్, వారి మేనకోడలు పుట్టువెంట్రుల కార్యక్రమానికి శ్రీకాళహాస్తికి వెళ్లి తిరిగి వస్తున్న క్రమములో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు మరియు కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న నెమ్మది వెంకటమ్మ, కుమారుడు నెమ్మది అశోక్, భవితాక్షరీ అక్కడిక్కడే మృతిచెందారు. కారులో వున్న ఇద్దరి పరిస్థితి విషమంగా వుంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. గాయ పడ్డ వారిని అస్పత్రికి తరలించారు.


Next Story

Most Viewed