‘మండు వేసవిలోనూ మత్తడి దూకించిన ఘనత కేసీఆర్‌ది’

by Disha Web Desk 2 |
‘మండు వేసవిలోనూ మత్తడి దూకించిన ఘనత కేసీఆర్‌ది’
X

దిశ, వెబ్‌డెస్క్: కేసీఆర్ పాలనపై కరీంనగర్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి బోయిన‌పల్లి వినోద్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం ఉదయం జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరీంనగర్‌ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతా అని జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. కొన్ని రాజకీయ పార్టీలు అభివృద్ధిని మరిచి వేరే అజెండా అమలు పరుస్తున్నారని విమర్శించారు.


బీఆర్ఎస్ హయాంలో ప్రాజెక్ట్‌లు నీటితో కళకళలాడాయని అన్నారు. మండు వేసవిలోనూ మత్తడులు దూకించిన ఘనత కేసీఆర్‌ది అని కొనియాడారు. నీటి కోసం ప్రజలు, రైతులు ఇబ్బంది పడే పరిస్థితి ఎప్పుడూ రావొద్దని ఆకాంక్షించారు. మోసపూరిత హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందన్నారు. ఇందిరమ్మ రాజ్యం తెస్తామని చెప్పి ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారని.. ప్రజా సమస్యలను పట్టించుకోవడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైరయ్యారు. మార్పు అంటే నీరు, కరెంటు లేక ఇబ్బందులు పడేలా చేయడం కాదని ఆయన దుయ్యబట్టారు.



Next Story

Most Viewed