- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
గురునానక్ కాలేజీని ముట్టడించిన బీజేవైఎం
by Disha Web Desk 4 |
X
దిశ, రంగారెడ్డి బ్యూరో, ఇబ్రహీంపట్నం: అనుమతులు లేకుండా అడ్మిషన్లు తీసుకుంటున్నారని రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం గురునానక్ ఇంజనీరింగ్ కాలేజీని బీజేవైఎం నాయకులు ముట్టడించారు. పోలీసులకు బీజేవైఎం నాయకులకు పెద్ద ఎత్తున ఘర్షణ వాతావరణం జరిగింది. అయినప్పటికీ బీజేవైఎం నాయకులు గేట్లు దూకి లోపలికి ప్రవేశించి కాలేజీ ప్రిన్సిపాల్ ఛాంబర్లోకి చొచ్చుకెళ్లి నిరసన తెలిపారు. సుమారుగా 4,000 మంది విద్యార్థులకు మోసం చేసిన గురునానక్ యజమాన్యంపై చర్యలు తీసుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేసి నినాదాలతో హోరేత్తించారు. పోలీసులకు, బీజేవైఎం నాయకులకు మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరిగింది. ప్రస్తుతం కాలేజీ వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది.
Next Story