మునుగోడులో బీజేపీ మాస్టర్ స్కెచ్.. ప్రచార ముగింపు సభకు బిగ్ లీడర్!

by Disha Web Desk 2 |
మునుగోడులో బీజేపీ మాస్టర్ స్కెచ్.. ప్రచార ముగింపు సభకు బిగ్ లీడర్!
X

దిశ, డైనమిక్ బ్యూరో: మునుగోడులో ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీలు జోరు పెంచాయి. ఎన్నిక తేదీ సమీపిస్తున్న వేళ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికను టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ నేపథ్యంలో బీజేపీ మరోసారి భారీ బహిరంగ సభకు ప్లాన్ చేస్తోంది. ఇదివరకే ఓ సారి కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేత బహిరంగ సభ ఏర్పాటు చేసిన కమలనాధులు అక్టోబర్ 31న మరో భారీ సభకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సారి మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల మునుగోడు నియోజకవర్గంలో జేపీ నడ్డాకు సమాధి కట్టిన వ్యవహారం తీవ్ర దుమారం రేపింది. ఈ ఘటనపై టీఆర్ఎస్ దిగజారుడు రాజకీయాలు చేస్తోందని బీజేపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ చేస్తున్న దుష్ప్రచారాలను తిప్పికొట్టేందుకు జేపీ నడ్డాను రంగంలోకి దింపబోతున్నట్లు సమాచారం.

కేసీఆర్ కు కౌంటర్ ఇచ్చేలా ప్లాన్?:

మునుగోడు నియోజకవర్గంలో తప్పక గెలవాలని పార్టీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగా నోటిఫికేషన్ వెలువడకముందే టీఆర్ఎస్, బీజేపీలు తమ అగ్ర నేతలతో ఓ సారి మీంటింగ్ లను ఏర్పాటు చేశాయి. తాజాగా ప్రచారం ముగింపు దగ్గర పడుతున్న కొద్ది ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అగ్రనేతలు మరోసారి రంగంలోకి దిగబోతున్నారు. ఇప్పటికే ఓ సారి మునుగోడులో పర్యటించిన సీఎం కేసీఆర్ మరోసారి మీటింగ్ ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రచరం జరుగుతోంది. ఈ నెల 30వ తేదీన కేసీఆర్ మునుగోడు ప్రచారంలో పాల్గొంటారని తెలుస్తోంది. ఆ నేపథ్యంలో టీఆర్ఎస్ సభ ముగిసిన మరుసటి రోజే జేపీ నడ్డాను రంగంలోకి దించేలా ప్రణాళికలు వేస్తోంది. ఈ సభ ద్వారా అంతకు ముందు రోజు కేసీఆర్ చేసిన కామెంట్స్ కు జేపీ నడ్డా కౌంటర్ ఇచ్చేలా వ్యూహరచన చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ప్రచార ముగింపు సభకు జేపీ నడ్డా రానుండటంతో మునుగోడు రాజకీయం చివరి అంకంలో మరింత హీటెక్కడం ఖాయం అని తెలుస్తోంది.



Next Story

Most Viewed