డిసెంబర్ 3న తెలంగాణలో అధికారంలోకి బీజేపీ: అమిత్ షా కీలక వ్యాఖ్యలు

by Disha Web Desk 19 |
Home Minister Amit Shah
X

దిశ, డైనమిక్ బ్యూరో: డిసెంబర్ 3వ తేదీన తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రాబోతున్నదని కేంద్ర మంత్రి అమిత్ షా అన్నారు. ఆదిలాబాద్‌లో జరిగిన బీజేపీ జన గర్జన సభలో మాట్లాడిన అమిత్ షా తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాల్సిన సమయం ఆసన్నం అయిందని.. ఇక్కడ బీజేపీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు. గిరిజన యూనివర్సిటీకి పదేళ్లుగా కేసీఆర్ భూమి ఇవ్వలేదని ఆరోపించారు.

ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణకు పసుపు బోర్డు, ట్రైబల్ యూనివర్సిటీ, కృష్ణా జలాల పంపకాల కోసం ట్రైబ్యునల్ ఏర్పాటు చేస్తున్నారని మహిళలకు రిజర్వేషన్ కల్పించారని అన్నారు. ఈ పదేళ్లలో కేసీఆర్ కుటుంబమే బాగుపడిందన్నారు. ఈ నేల మీద పుట్టిన కొమురం భీం స్వాతంత్ర్యం కోసం పోరాటం చేశారు. రజాకార్లపై ఈ ఇక్కడి ప్రజలు పోరాటం చేశారు. ఈ వీర భూమికి నేను నమస్కరిస్తున్నానన్నారు.


Next Story