Eatala Rajendar: మలేషియా టూర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్

by Ramesh Naini |

Eatala Rajendar: మలేషియా టూర్‌లో బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ నేత, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajendar) విదేశీ పర్యటనలో ఉన్నారు. ఈ మేరకు ఆయన శనివారం మలేషియాలోని (Kuala Lumpur) కౌలాలంపూర్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా భారతీయ అసోసియేషన్ ఆఫ్ మలేషియా (BAM) అధ్యక్షుడు చొప్పరి సత్య, ప్రధాన కార్యదర్శి రవితేజ శ్రీదాస్యం, ట్రెజరర్ సునీల్ కుమార్, అలాగే BAM కోర్ కమిటీ సభ్యులు ఎంపీ ఈటల రాజేందర్‌కి ఘన స్వాగతం పలికారు.

ఈ మేరకు BAM ప్రతినిధులు మాట్లాడుతూ.. మన దసరా, బతుకమ్మ, దీపావళి మహోత్సవంలో ముఖ్య అతిథిగా హాజరుకానున్న ఈటల రాజేందర్ రాకతో ఈ వేడుక మరింత వైభవంగా సాగనుందని తెలిపారు. ఆయన కుటుంబం హాజరు కావడం మనందరికీ మరింత ఆనందాన్నిచ్చింది అని వెల్లడించారు. ఇవాళ, రేపు ఆయన మలేషియాలోనే ఉండి అనంతరం తిరుగు ప్రయాణం అవుతారని సమాచారం.

Next Story