మోడీకి ఓటు వేయకుంటే నరకానికే! ఎంపీ అరవింద్ ధర్మపురి కామెంట్స్ వివాదం!

by Disha Web Desk 14 |
మోడీకి ఓటు వేయకుంటే నరకానికే! ఎంపీ అరవింద్ ధర్మపురి కామెంట్స్ వివాదం!
X

దిశ, డైనమిక్ బ్యూరో: బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విజయ సంకల్ప యాత్రలో భాగంగా నిర్వహించిన సభలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రధాని ఇచ్చే పథకాలు తీసుకుంటూ మోడీకి ఓటు వెయ్యకుంటే నరకానికి పోతారని ఎంపీ అరవింద్ ధర్మపురి వ్యాఖ్యనించారని తాజాగా సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది. ఈ సభలో ధర్మపురి మాట్లాడుతూ.. కేంద్ర ఇచ్చే ఉచిత గ్యాస్, స్కూళ్లు మంచిగా కట్టించడం, వైద్యం, షాదిమురక్‌కు డబ్బు, రుణాలు, ముద్ర లోన్స్ లాంటి అన్ని పథకాలకు ప్రధాని పైసలు ఇస్తున్నారని చెప్పారు.

ట్రిపుల్ తాలక్ తీసి ముస్లిం మహిళలకు ఆత్మగౌరవం తెచ్చింది.. నరేంద్ర మోడీనే అని హర్షం వ్యక్తంచేశారు. ఇలాంటి అన్ని సంక్షేమ ఫలాలు మోడీ ప్రభుత్వం ఇస్తుండగా.. మీరు కాంగ్రెస్, బీఆర్ఎస్‌కు గానీ ఓటు వేస్తే.. దేవుడు మిమ్మల్ని నరకానికి తీసుకపోతరని, స్వర్గానికి వెళ్లరని అన్నారు. స్వర్గానికి పోవాలంటే దేశానికి సేవ చేసే వారికే ఓటు వేయాలని లేదంటే దేవుడు కూడా క్షమించడని వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈ కామెంట్స్‌పై నెటిజన్లు తీవ్ర స్థాయిలో స్పందిస్తున్నారు. ధర్మపురి అర్వింద్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. సంక్షేమ పథకాలు మోడీ ఏమైనా తన ఆస్తులు అమ్మి ఇస్తుండా? అని ప్రశ్నిస్తున్నారు.

Next Story

Most Viewed