- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
నన్ను ఓడించేందుకు రూ.600 కోట్లు ఖర్చు: ఎమ్యెల్యే ఈటల సంచలన వ్యాఖ్యలు
by Disha Web Desk 19 |
X
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ బీజేపీ ఎన్నికల కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మంత్రి హరీష్ రావుకు సవాల్ విసిరారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తానని చాలెంజ్ చేశారు. తొమ్మిది గంటలు కరెంట్ ఇచ్చి.. 24 గంటలు ఇస్తున్నామని చెబుతున్నారని ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో కరెంట్ బిల్లులు పెంచి రైతన్న నడ్డి విరిచారన్నారు. తాను పర్యటించే ఊళ్లలో కరెంట్ కట్ చేస్తున్నారని ఆరోపించారు. హుజూరాబాద్ ఉప ఎన్నికలలో నన్ను ఓడించేందుకు రూ.600 కోట్లు ఖర్చు చేశారని ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ సొంత జిల్లా రైతులకు రుణమాఫీ చేయలేదని ఆరోపించారు. హరీష్ రావు మాటలు కోటలు దాటుతున్నాయని విమర్శించారు.
Next Story