సౌత్‌లో పట్టు కోల్పోయిన BJP.. కర్ణాటక ఓటమితో చేజారిన ఆధిపత్యం

by Disha Web Desk 4 |
సౌత్‌లో పట్టు కోల్పోయిన BJP.. కర్ణాటక ఓటమితో చేజారిన ఆధిపత్యం
X

దిశ, తెలంగాణ బ్యూరో : కర్ణాటక రాష్ట్రంలో అధికారాన్ని నిలుపుకోవడంలో బీజేపీ విఫలమైంది. ఐదు దక్షిణాది రాష్ట్రాల్లో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ పవర్‌లో ఉంది. మిగిలిన రాష్ట్రాల్లో సింగిల్ డిజిట్‌కే పరిమితమైంది. ఇప్పుడు ఆ ఒక్క రాష్ట్రాన్ని కూడా చేజార్చుకోవడంతో బీజేపీకి పట్టు లేకుండా పోయింది. తమిళనాడులో డీఎంకే, కేరళలో సీపీఎం, తెలంగాణలో బీఆర్ఎస్ పూర్తిగా యాంటీ-బీజేపీ స్టాండ్‌తో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ఒక ప్రాంతీయ పార్టీగా ఉంటూనే కేంద్రంలోని బీజేపీతో ఫ్రెండ్లీ రిలేషన్స్ మెయింటెయిన్ చేస్తున్నది. ఏ రాష్ట్రంలోనూ అధికారంలో లేని బీజేపీ రానున్న పార్లమెంటు ఎన్నికల్లోనూ తన ప్రాభవాన్ని కోల్పోకుండా డిఫెన్స్ స్ట్రాటెజీపై ఫోకస్ పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. తెలంగాణ ద్వారా సౌత్ ఇండియాలోకి ఎంట్రీ కావాలనుకున్న బీజేపీకి కర్ణాటక రిజల్ట్ దెబ్బకొట్టినట్లయింది.

Read More... ఉప ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలకు బిగ్ షాక్!



Next Story

Most Viewed