బీసీ అభ్యర్థి వైపు బీజేపీ మొగ్గు..! అనూహ్యంగా తెరపైకి విక్రమ్ గౌడ్ పేరు

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-13 16:56:47  IST  )

జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో కమలనాథులు బీసీ వర్గానికి చెందిన యువనేత పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది.

బీసీ అభ్యర్థి వైపు బీజేపీ మొగ్గు..! అనూహ్యంగా తెరపైకి విక్రమ్ గౌడ్ పేరు
X

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్​ఉప ఎన్నికల్లో కమలనాథులు బీసీ వర్గానికి చెందిన యువనేత పోటీ చేయిస్తారనే ప్రచారం జరుగుతోంది. అనూహ్యంగా మాజీ మంత్రి ముఖేష్ గౌడ్​తనయుడు విక్రమ్​గౌడ్​పేరు తెర మీదికి వచ్చింది. ఆయన పార్టీ సీనియర్లతో టచ్‌లో ఉన్నట్ల పార్టీ కార్యాలయంలో టాక్​వినిపిస్తోంది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన విక్రమ్ గౌడ్ టికెటు కోసం ప్రయత్నాలు చేశారు. అధికార కాంగ్రెస్​బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం ఫెయిల్​అయితే ఉప ఎన్నికల్లో బీసీలకే టికెట్లు ఇచ్చామనే ప్రచారం చేసుకునేందుకు నవీన్​యాదవ్‌కు ఇచ్చినట్లు పార్టీలో చర్చ జరుగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్​బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా బీజేపీ ఉందనే విమర్శలకు చెక్​పెట్టేందుకు కమల నాథులు కూడా బీసీ వర్గానికి చెందిన నేతకు టికెట్లు ఇచ్చేందుకు పరిశీలన చేస్తున్నట్లు తెలిసింది.

బీఆర్‌ఎస్ ​కూడా బీసీలకు వ్యతిరేకమని, అగ్ర వర్గాలకు చెందిన వారికే టికెట్లు ఇచ్చిందని, తామే నిజమైన వాదం ఎత్తుకున్నట్లు ప్రజలకు వినిపించేందుకు బీసీ నాయకుని ఉప పోరులో నిలబెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు పార్టీ సీనియర్లు తెలిపారు. ఇన్నాళ్లు పార్టీ కోసం శ్రమించిన లంకాల దీపక్‌రెడ్డి పరిస్థితి ఏమిటని శ్రేణులు చర్చించుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తూ ప్రజలు మధ్య ఉంటూ మోడీ పథకాలను వివరిస్తూ తెలంగాణ అభివృద్ది బీజేపీతో సాధ్యమని ప్రచారం చేస్తున్నారు. మొన్నటి వరకు ఆయనే అభ్యర్దిగా నియోజకవర్గం నేతలంతా భావించారు. తాజాగా విక్రమ్​గౌడ్​పేరు వినిపిస్తుండటంతో పార్టీ కోసం పని చేసిన నేతలను మోసం చేయడం తగదని కేడర్​సూచిస్తుంది.

Next Story