- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
'మేము గెలవమని ముందే తెలుసు...' : బీజేపీ చీఫ్ రామచందర్ సంచలన వ్యాఖ్యలు
జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యంలో దుసుకుపోతుండగా.. బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది.

దిశ, వెబ్ డెస్క్ : జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతున్న సంగతి తెలిసిందే. కౌంటింగ్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆధిక్యంలో దుసుకుపోతుండగా.. బీజేపీ పూర్తిగా వెనుకంజలో ఉంది. అయితే ఈ లెక్కింపు ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేసారు. తాము ఈ ఎన్నికల్లో గెలవమని ముందే తెలుసని హాట్ కామెంట్స్ చేసారు. కేవలం ప్రాతినిధ్యం వహించడానికే తమ పార్టీ ఈ ఎన్నికల్లో పోటీ చేసిందని చెప్పుకొచ్చారు. అయితే ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్ లో బీజేపీకి 2,167 ఓట్లు రాగా.. తరువాతి రౌండ్స్ లో పూర్తిగా వెనకబడిపోయింది. అలాగే ఓట్ల లెక్కింపు వద్ద ఆ పార్టీ నాయకులు గాని, కార్యకర్తలు గాని ఎవరూ లేకపోవడం గమనార్హం.
Read More..
Live Updates : బిహార్, జూబ్లీహిల్స్ ఎలక్షన్ రిజల్ట్స్
జూబ్లీహిల్స్ ఓట్ల లెక్కింపులో దూసుకుపోతున్న కాంగ్రెస్.. ఐదో రౌండ్కు 12700 ఓట్ల లీడ్






