'ఆ రోజు దగ్గర్లోనే ఉందని యాదుంచుకో దొరా'

by Disha Web Desk 2 |
ఆ రోజు దగ్గర్లోనే ఉందని యాదుంచుకో దొరా
X

దిశ, వెబ్‌డెస్క్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం వ్యవహారంలో ఎమ్మెల్సీ కవిత పాత్రపై విచారణ చేయాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేశారు. ''అవినీతి ఆరోపణలు ఎదుర్కుంటున్న నీ బిడ్డకు అండదండలా? నీ దమన నీతిపై పోరాడే బీజేపీ నాయకులు, కార్యకర్తలకు అరెస్టులు, నిర్బంధాలా? పరాకాష్టకు చేరిన నీ నియంతృత్వాన్ని గద్దె దించే రోజు దగ్గర్లోనే ఉందని యాదుంచుకో దొరా... నీ అవినీతి పాలన సాలు దొర- నీ అరాచకాలకు సెలవు దొర'' అంటూ ట్విట్టర్ వేదికగా సీరియస్ కామెంట్స్ చేశారు.



Next Story