బీజేపీ అభ్యర్థుల ఎంపిక రిపోర్టు సిద్ధం.. స్క్రూటినీ కోసం ఢిల్లీకి తీసుకెళ్లిన కిషన్‌రెడ్డి

by Disha Web Desk 1 |
బీజేపీ అభ్యర్థుల ఎంపిక రిపోర్టు సిద్ధం.. స్క్రూటినీ కోసం ఢిల్లీకి తీసుకెళ్లిన కిషన్‌రెడ్డి
X

దిశ, తెలంగాణ బ్యూరో : పార్లమెంట్ ఎన్నికల్లో అభ్యర్థులు ఎవరైతే బాగుంటుందనే అంశంపై బీజేపీ స్పీడప్ చేసింది. ఇప్పటికే అభ్యర్థులపై అభిప్రాయ సేకరణ చేపట్టిన కాషాయ పార్టీ దానిపై పూర్తి స్థాయిలో ఓ నివేదికను కూడా రూపొందించింది. కాగా, స్క్రూటినీ కోసం ఆ నివేదికతో కేంద్ర మంత్రి కిషన్‌‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారీ ఢిల్లీకి పయనమయ్యారు. ఒక్కో పార్లమెంట్ స్థానం నుంచి ముగ్గురితో కూడిన లిస్ట్ బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీకి బీజేపీ రాష్ట్ర ఎన్నికల కమిటీ పంపినట్లు తెలిసింది. కాగా, ఆ రిపోర్టుపై బీజేపీ ఎన్నికల కమిటీ స్క్రూటినీ చేయనుంది.

Next Story

Most Viewed